Saturday, May 4, 2024

ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలైనా కర్నూలు జిల్లా, ఆదోని పట్టణంలో రూట్, రూఫ్- టాప్ ప్రాంతాలలో హెలిపాడ్, బహిరంగ సభ సమావేశ ప్రాంగణం , తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 06 మంది డిఎస్పీలు, 40 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 115 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు, 350 మంది కానిస్టేబుళ్ళు, 50 మంది మహిళా పోలీసులు, 100 మంది హోంగార్డులు, 04 సెక్షన్ల ఏఆర్ సిబ్బంది, 04 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది, 11 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు. జిల్లా ఎస్పీ పాటు అడిషనల్ ఎస్పీ రమణ, డీఎస్పీలు వినోద్ కుమార్, వెంకటాద్రి, యుగంధర్ బాబు, వెంకట్రామయ్య, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement