Saturday, May 18, 2024

రాష్ట్రంలో బీజేపీ గెలవదు.. సత్యవతి రాథోడ్

రాష్ట్రంలో బీజేపీ గెలవదని, అంతే కాకుండా.. రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావడం కూడా గొప్పేనని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… మరో మారు విజయసభ పెట్టుకోలేమని ముందే పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక ఆదివాసీ మహిళకు మంచి చేస్తే అందరి కపుడు నిండదని… ద్రౌపది మూర్ము పీఎం అయితే ఆదివాసీలకు ఒరిగేది ఏముందని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కళ్ళు ఉండి చూడలేని కబోదులని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందనుకుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. కుటుంబ పాలన అని కేటీఆర్, కేసీఆర్ మీద ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement