Thursday, May 23, 2024

తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

నీటిగుంతలోకి దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలోని యర్రగుంట్లలో చోటుచేసుకుంది. చనిపోయిన వారిని లక్ష్మీదేవి, అక్షయ(8), రేవంత్(6) గా గుర్తించారు. వేంపల్లి రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి గుడి వెనుక తవ్వకాలు చేపడుతున్న గని వరద నీటిలో యర్రగుంట్లలో నివాసముంటున్న లక్ష్మీదేవి, తన ఇద్దరు పిల్లలతో కలసి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా లక్ష్మీదేవి మృతదేహాన్ని లోతులో గాలించగా దొరికింది. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement