Thursday, May 16, 2024

Breaking: విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చౌడేపల్లి మండలం పెద్ద కొండామరిలో సంపు శుభ్రం చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగలడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు రమణ, మునిరాజ, రవిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement