ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో చేరింది. ఆమెకు తోడుగా 11ఏళ్ల కూతురు కూడా హాస్పిటల్ కు వచ్చింది. అయితే ఇదే అదనుగా తీసుకున్న ఓ కామాంధుడు ఆ బాలికపై కన్నేశాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగింది. తల్లితో పాటే బాలిక కూడా హాస్పిటల్లో ఉండగా., మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది. ఆదునీకరణ పనులు జరుగుతుండగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ధీరజ్ (22) అనే యువకుడు పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. అతడి కన్ను ఒంటరిగా ఉన్న బాలికపై పడింది. అర్ధరాత్రి 12గంటల సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఆధునీకరణ పనులు జరుగుతున్న హాస్పిటల్లోకి తీసుకెళ్లాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఆ బాలికను తీసుకువెళుతుండగా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు గమనించాడు. అనుమానంతో వెళ్లిచూడగా ధీరజ్ బాలికతో వెకిలిచేష్టలకు పాల్పడటం చూసి ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులతో కలిసి నిందితుడిని పట్టుకున్నాడు. అందరూ కలిసి బాలికను కాపాడి నిందితుడికి దేహశుద్ది చేశారు.
హాస్పిటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించగా నిందితుడిని అరెస్ట్ చేశారు. చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
కాగా, విజయవాడలో ఇట్లాంటిదో మరో ఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్ తీవ్ర సంచలనం సృష్టించింది. మానసిక వికలాంగురాలిని హాస్పిటల్లో బంధించి కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిత్యం పేషెంట్స్, వారి సహాయకులు, డాక్టర్లు, ఇతర సిబ్బందితో కిటకిటలాడే ప్రభుత్వాస్పత్రిలోనే యువతిని బంధించి అత్యాచారానికి పాల్పడటంతో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తమవడమే కాదు ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువతి మానసిక పరిస్థితి గురించి తెలుసుకున్న శ్రీకాంత్ ప్రేమపేరుతో నమ్మించాడు. తనతో వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిని తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్ళాడు. ఓ గదిలో ఆమెను బంధించిన శ్రీకాంత్ అఘాయిత్యానికి పాల్పడగా ఆ తర్వాత మరో ఇద్దరు అత్యాచారం చేశారు.