Monday, May 6, 2024

భార్యను కడతేర్చిన భర్త

భార్య‌ను ఓ భ‌ర్త క‌డ‌తేర్చిన ఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తిరుప‌తి ప‌రిధి రామచంద్రపురం మండలం పరకాల సమీపంలోని గోవింద్ రెడ్డి కోళ్ల ఫారం వద్ద మంగళవారం భాస్కర్ అనే వ్యక్తి తన భార్య అమ్ములును హత్య చేసి పరారయ్యాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణ జ‌రుగుతూ ఉండేది. అయితే భార్య భర్తలు సొంత ఊరు వడమాలపేట మండలం భద్ర నాయుడు కండ్రిగ లోని ఎస్సీ కాలనీకి చెందిన వారు. వీరు సంవత్సరానికి పైగా కోళ్లఫారం వద్ద పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. సంఘటనా స్థలానికి రామచంద్రాపురం పోలీసులు వెళ్లి పరిశీలించి క్లూస్ టీం వివరాలు సేకరించడం జరిగింది.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై రామచంద్రపురం ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement