Saturday, May 4, 2024

AP: వలస కార్మికుల మృతి బాధాకరం.. నారా లోకేష్

బెంగళూరు సమీపంలోని చిక్కబళ్లాపూర్ శివార్లలో జరిగిన రోడ్డుప్రమాదంలో వలస కార్మికులు మృతిచెందడం బాధాకరమని.. పెద్దమనసుతో ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పొట్టకూటి కోసం పొరుగురాష్ట్రానికి వెళ్తున్న శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన 12మంది వలస కూలీలు బెంగుళూరు మార్గమధ్యలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన నారా లోకేష్.. వలస కూలీల మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతి చెందిన వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని వ్యవసాయ కూలీలే కావడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పెద్ద మనసుతో మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement