Friday, May 3, 2024

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకారుల అరెస్ట్

ప్రభన్యూస్, గుంటూరు : గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గుంటూరు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న దీక్షల సందర్భంగా ఈరోజు పిలుపునిచ్చిన మహా ధర్నా కార్యక్రమంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేస్తున్న నల్లమాడ రైతు సంఘం నాయకుడు కొల్లా రాజమోహన్ రావు, వివిధ రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి నిరసన తెలియజేస్తూ శాంతియుత మార్గంలో సంఘీభావం తెలియజేస్తున్న గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణను ఆక్రమంగా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో తెలుగు రైతు రాష్ట్ర ప్రచార కార్యదర్శి గింజుపల్లి వెంకటేశ్వరావు, గుంటూరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు ఇమ్మడి మల్లికార్జునరావు, ఏపీ కాంగ్రెస్ కిసాన్ ఉపాధ్యక్షులు లావు అంకమ్మ చౌదరి, అమరావతి దళిత బహుజన జెఏసీ కన్వినర్ చిలకా బసవయ్య, నిమ్మగడ్డ గోపినాథ్, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిది షేక్ షుకూర్, జిల్లా ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు, కార్యదర్శి మాచవరపు దాసు, గుంటూరు పశ్చిమ తెలుగు యువత ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి ఉగ్గిరాల మార్కండేయులు, తెలుగు యువత నాయకులు సన్నపు ఆదిత్య రెడ్డి, బుల్లా కుమార్ బాబు వివిధ పౌర ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement