Tuesday, May 21, 2024

మాయ చేసి.. మట్టుపెట్టారు… తెలంగాణలో మిస్సింగ్ – కర్నూల్ లో వీడిన మిస్టరీ

కర్నూలు bతెలంగాణలో మాయమైన వ్యక్తి హత్య కేసు మిస్టరీ కర్నూలులో వీడింది. తెలంగాణలోని, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, రామకృష్ణపురానికి చెందిన కావాలి భారతయ్య (55) ఇటీవల కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..

చెప్పుతో కొట్టాడని.. కక్షతో హత్య

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భారతయ్య జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. తీవ్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని కర్నూలు జిల్లాలో చేదించారు. ఆయనను కిడ్నాప్ చేసిన హంతకులు.. ఆ తర్వాత చంపేసి.. కల్లూరు మండలం ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దహనం చేశారు.

ఆలస్యంగా వెలుగు చూసినా ఘటన వివరాలు ఉలిందకొండ పోలీసులు వెల్లడించిన మేరకు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా రామకృష్ణ పురానికి చెందిన రవీంద్ర గౌడ్, కల్లు దుకాణ నిర్వహించేవాడు. అయితే అప్పట్లో అతని భార్య ఏవో ఇతర కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంది. కాగా ఆమె మృతికి భర్త రవీంద్ర గౌడ్ వేధింపులే కారణం అంటూ గ్రామస్తులు అతడిని విపరీతంగా కొట్టారు.
ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన భారతయ్య అనే వ్యక్తి రవీంద్ర గౌడ్ ను చెప్పుతో కొట్టాడు. దీంతో భారతయ్య పై రవీంద్ర గౌడ్ కక్ష పెంచుకున్నాడు. భార్య హత్య కేసులో జైలుకు వెళ్లిన రవీంద్ర గౌడ్.. జైలు నుంచి వచ్చిన తర్వాత భారతయ్యను చంపడానికి తనకు జైల్లో పరిచయమైన షఫీ అనే వ్యక్తితో కలిసి పథకం వేశాడు.
ఇందులో భాగంగానే గత నెల 26వ తేదీన అప్పరాల గ్రామం దగ్గర భారతయ్య ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. కారులో అక్కడికి వచ్చిన రవీంద్ర గౌడ్.. ఊరి దగ్గర దింపుతాను అంటూ కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు.ఆ తర్వాత పథకం ప్రకారం తన దగ్గర ఉన్న రుమాలతో గొంతు బిగించాడు. రాడుతో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి. కల్లూరు మండలం, ఉల్లిందకొండ సమీపంలోని కొల్లంపల్లి తండా సమీపంలో పడేశారు. అంతేకాదు మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండడం కోసం.. పెట్రోల్ పోసి..నిప్పంటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు..

- Advertisement -

మరోవైపు ఎంతకీ భారతయ ఇంటికి రావడం రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భార్య శివమ్మ భర్త మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల విచారణ క్రమంలో కుటుంబ సభ్యులు రవీంద్ర గౌడ్ మీద అనుమానం వ్యక్తపరిచారు. దీంతో పోలీసులు రవీంద్ర గౌడ్ ను తీసుకెళ్లి తమాదైన స్థాయిలో విచారించగా హత్య విషయం వెలుగు చూసింది. ఘటనా స్థలానికి కొత్తకోట సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మంజునాథరెడ్డి, ఉల్లిందకొండ ఎస్సై నల్లప్ప పరిశీలించారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement