Saturday, May 4, 2024

ప్రాజెక్టుల దగ్గర 144 సెక్షన్ ఎందుకు?: వైసీపీపై గోరంట్ల ఫైర్

జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై పూర్తిగా నీలినీడలు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను పరిశీలించకుండా ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల దగ్గర 144 సెక్షన్ ఎందుకు పెడుతున్నారని గోరంట్ల ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు ఎందుకు సాధించలేకపోతున్నారని నిలదీశారు. గత ప్రభుత్వ పథకాలకే పేర్లు మార్చి సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామంటున్నారని విమర్శించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement