Wednesday, May 8, 2024

హోదాపై జగన్ దగా.. యువతకు తీవ్ర నష్టం: యనమల

వైసీపీ ఎంపీలంతా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలని చేసిందని టీడీపీ సీనియర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు డిమాండ్ చేశారు. వైసీపీకి అత్యధిక ఎంపీలు ఉన్నా కూడా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేసుల భయంతో సీఎం జగన్ కేంద్రానికి లొంగిపోయారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై జగన్ ప్రజలను దగా చేశారన్నారు. హోదా తేవడం చేతకాదని సీఎం జగన్ ప్రకటనే స్పష్టం చేసిందని పేర్కొన్నారు. యువతను ఉద్యోగాల పేరులో వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని యనమల ఆరోపించారు. సీఎం జగన్‌ తీరుతో రాష్ట్రానికి, యువతకు తీవ్ర నష్టం వాటిల్లిందని వ్యాఖ్యానించారు. యువ‌త‌కు ఉద్యోగాలు ఇస్తున్నామ‌ని సీఎం జగన్ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పరిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు లేక ఏ ప‌రిశ్ర‌మా రాష్ట్రానికి రావ‌ట్లేదన్నారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు కూడా ఎవ‌రూ ఆస‌క్తి చూపడం లేదని యనమల చెప్పారు.

ఇదీ చదవండి:ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement