Sunday, April 28, 2024

TDP-Janasena / సైకిల్ – గ్లాస్ గుర్తుల‌తో తెలుగుదేశం కొత్త లోగో ….

తాడేప‌ల్లి – ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి నుంచి “రా కదలి రా!” పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించబోతోంది.. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో విడుద‌ల చేశారు.. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో ఈరోజు ఆ పార్టీ ఎపి శాఖ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్క‌రించారు.

..ఇది ఇలా ఉంటే పంచాయితీల సమస్యలపై రేపు సర్పంచులతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తారు.. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు, 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ బహిరంగసభ ఏర్పాట్లలోమునిగిపోయారు పార్టీ నేతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement