Thursday, May 9, 2024

భూ అక్ర‌మాల్లో త‌హ‌సీల్దార్ హ‌స్తం.. స‌స్పెండ్ చేస్తూ క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు

కర్నూలు ప్రతినిధి: క‌ర్నూలు జిల్లాలో భూ అక్ర‌మాల్లో త‌ల‌దూర్చిన ఓ త‌హ‌సీల్దార్ ని క‌లెక్ట‌ర్ ఇవ్వాల స‌స్పెండ్ చేశారు. ఆదోని రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఆలూరు మండల త‌హ‌సీల్దార్ డి హుస్సేన్ సాహెబ్ ని స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. భూ సమస్యల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినందుకు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని సర్వే నంబర్. 894..864 తో పాటు 924 సర్వేనెంబర్ లో ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడ్డారని క్షేత్రస్థాయిలో నివేదికల ఆధారంగా ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement