Sunday, May 19, 2024

TTD | 7నుంచి తిరుమలలో శ్రీవేంకటేశ్వర నవరత్న మాలిక

తిరుమల, ప్రభ న్యూస్‌ ప్రతినిధి : కర్ణాటక సంగీత పితామహులు శ్రీపురందరదాసు ఆరాధన మహోత్సవాలు టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 10 వరకు తిరుమల ఆస్థానమండపంలో వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తిరుమలలోని కళ్యాణవేదికలో రాత్రి 7 గంటలకు యువ కళాకారులతో శ్రీవేంకటేశ్వర నవరత్నమాలిక గోష్ఠిగానం నిర్వహించనున్నారు. శ్రీపురందరదాసు వేలాది సంకీర్తనలు రచించారు. వీటిలో ప్రధానమైన 9 సంకీర్తనలను దాదాపు 300 మంది ప్రసిద్ధ కళాకారులు గోష్ఠిగానం చేస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు పర్వవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement