Monday, April 29, 2024

Srisailam – మల్లన్న సేవలో మంత్రి రోజా

శ్రీశైలం ప్రభ న్యూస్. క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశిర్చన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ కార్య నిర్వహణ అధికారి డి పెద్దిరాజు మంత్రికి స్వామి అమ్మవార్ల శేష వస్త్ర జ్ఞాపిక ప్రసాదాలను అందజేశారు .

మంత్రి రోజా దర్శనార్థం ఆలయ ప్రధాన రాజగోపురం వద్దకు రాగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు సహాయ కార్యనిర్వాణా అధికారులు. మోహన్ ఫణి దర్ ప్రసాద్. హరిదాసు దేవస్థానం అధికారులు అర్చక పరిచారక స్వాములు వేద పండితులు పూలమాలతో మంత్రికి స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement