Saturday, May 4, 2024

Bhuvanagiri – బీజేపీ – భారత ప్రజల పార్టీ – మంద కృష్ణ మాదిగ

భువనగిరి నవంబర్ 27 (ప్రభ న్యూస్) బిజెపి ఎ మతానికో ఎ ప్రాంతానికి చెందిన పార్టీ కాదని భారత ప్రజల పార్టీ అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం బిజెపి ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. సామాజిక న్యాయం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం పెట్టడం లేదని తెలిపారు

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి పదవీలో దళితులకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అగ్ర కులాలలోని పేదలు ఈ డబ్ల్యూ ఎస్ తో అందరికంటే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాన్ని మోడీ పూర్తి చేశారని పేర్కొన్నారు తాను ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా పనిచేస్తున్నానని ప్రధాని మోడీ వర్గీకరణ కోసం మాట ఇచ్చారని త్వరలోనే వర్గీకరణ అమలవుతుందన్నారు

బే షరతుగా మాదిగలంతా బిజెపికి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు హామీలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని అమలు చేసేది మాత్రం బిజెపి అని తెలిపారు రాష్ట్రంలోని మాదిగలంతా బిజెపి కమలం పువ్వు పై ఓట్లు వేసి గెలిపించాలన్నారు బిజెపి అధికారంలోకి వస్తే బీసీ ని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడంతో 67 ఏళ్ల తెలంగాణ ప్రజల కల ఫలించింది అన్నారు సామాజిక న్యాయమే ధ్యేయంగా బిజెపి పనిచేస్తుందన్నారు .

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్రావు భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాశం భాస్కర్ పోతంశెట్టి రవీందర్ పడమటి జగన్మోహన్ రెడ్డి వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement