Tuesday, May 7, 2024

శ్రీ‌కాకుళేశ్వ‌ర స్వామి ఆదాయం రూ.2.35 ల‌క్ష‌లు

ఘంటసాల :
మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను గురువారం తెరిచి లెక్కించారు. రూ.2,35,735ల ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ జి.వి.డి.ఎన్.కుమార్ తెలిపారు. మచిలీపట్నం దేవాదాయశాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని హుండీల ఆదాయం లెక్కించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement