Sunday, April 28, 2024

AP: అందరి సహకారంతో శ్రీకాకుళం నగరాభివృద్ది ….నూతన కమిషనర్ తమీమ్

శ్రీకాకుళం, ఫిబ్రవరి 2(ప్ర‌భ‌న్యూస్‌): అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ అన్సారియా అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆమె కమిషనర్‌ గా బాధ్యతలు చేపట్టడంతో పలు విభాగాల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

ఘన చరిత్ర కలిగిన ఈ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు, కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. నగరంలో మరింత మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజా మరుగుదొడ్లు, పట్టణ ప్రణాళిక విభాగం, మున్సిపల్ పార్కులు మెరుగుపరుస్తామని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన వారిలో చీఫ్ ఇంజనీర్ పొగిరి సుగుణాకర రావు, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఉద్యానవన శాఖ ఏడి ప్రసాద్, పబ్లిక్ హెల్త్ డాక్టర్ వెంకటరావు, ఉమామహేశ్వరరావు‌, శివశంకర్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement