Monday, April 29, 2024

AP: జై అమ‌రావ‌తి నినాదం.. తిరుమ‌ల‌లో రోజాకు నిర‌స‌న సెగ‌

ఏపీ మంత్రి రోజాకు తిరుమల కొండపై నిరసన సెగ తగిలింది. శుక్ర‌వారం ఉదయం రోజా తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంత‌ర ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత… అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు.

ఆమెతో సెల్ఫీలు దిగుతూనే జై అమరావతి, ఏపీకి ఒకటే రాజధాని, వందేమాతరం అని నినాదాలు చేశారు. జై అమరావతి అని మీరు కూడా చెప్పండి అని రోజాను అడిగారు. అయితే.. రోజా చిరునవ్వులు చిందిస్తూనే… ‘శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది?’ అంటూ అక్కడి నుంచి ముందుకు సాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement