Sunday, April 28, 2024

AP: ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అవగాహన ర్యాలీ

పులివెందుల అర్బన్, ఫిబ్రవరి 2 (ప్రభ న్యూస్): యస్.పి సిద్దార్థ్ కౌశిల్ ఆదేశాలపై పులివెందుల డి.యస్.పి వినోద్ కుమార్ ఉత్తర్వుల మేరకు, 35వ జాతీయ రోడ్డుభద్రతా వారోత్సవాల్లో భాగముగా శుక్రవారం ద్విచక్ర వాహనాల ర్యాలీని మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మెన్ వల్లెపు వరప్రసాద్, అర్బన్ యస్.ఐ హుస్సేన్ పాల్గొని ద్విచక్ర వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

బైకు రైడర్లతో కలసి పులివెందులటౌన్ లోని కోర్ట్ సర్కిల్ నుండి పూలఅంగల్ల సర్కిల్ వరకు బైకుర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించక పోవడమువలన, కారు డ్రైవర్లు షీట్ బెల్ట్ పెట్టుకోక పోవడమువల్ల రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతము ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేసారు.దేశములో ప్రతిరోజు 28 మంది చొప్పున రోడ్డు ప్రమాదములో హెల్మెంట్ పెట్టక పోవడమువలనే ప్రాణాన్ని కోల్పోతున్నారని అన్నారు. కావున ప్రతిఒక ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్, వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణించాలన్నారు.త్రిబుల్ రైడింగ్, పరిమితికి మించి వాహనాలు నడుపుట, మద్యం సేవించి వాహనాలు నడుపుట వంటి చట్ట వ్యతిరేక పనులకు దూరముగా ఉండవలెనని సూచించారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వారిలో చైతన్యము నింపుటకు ద్విచక్రర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రూల్స్ కు అతిక్రమించి వెళితే జరిమానా తప్పదన్నారు. ఈ ర్యాలీలో జే సి ఎస్ ఇంచార్జ్ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement