Wednesday, May 15, 2024

వి.ఎన్.ఎం వైద్య శిబిరానికి విశేష స్పందన

ఇచ్ఛాపురం : వి.ఎన్.ఎం. పౌండేషన్ వ్యవస్థాపకులు వజ్రపు నరసింహమూర్తి వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పౌండేషన్ ఛైర్మన్ వజ్రపు వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని మెడికల్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని దాసన్నపేట లో ఆయన నివాసం వద్ద నిర్వహించిన ఈ శిబిరంలో 358 మంది రోగులను పరీక్షించారు. సుమారు రూ.3లక్షలకు విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రోగులందరికీ అక్కడికక్కడే రక్తపోటు, చక్కెర వ్యాధి పరీక్షలు, ఇ.సి.జి. పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement