Monday, May 13, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఎలుగుబంటి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. రెండు రోజులుగా హడలెత్తించిన ఎలుగుబంటిని ఎట్టకేలకు అటవీ సిబ్బంది పట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఎలుగుబంటి చిక్కింది. ఎలుగు దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు. సోమవారం ఆరుగురిపై దాడిచేసింది.

కొద్దిరోజులుగా ఎలుగుబంటి వజ్రపుకొత్తూరు సమీపంలోని జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై దాడి చేసింది. భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లిన గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చి దాడి చేసింది. వీరిలో ఒకరు చనిపోగా.. మిగిలిన వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగును పట్టుకోవాలని స్థానికులు కోరవడంతో అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగి చివరికి పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement