Sunday, May 5, 2024

SKLM: విద్యుత్ అంతరాయంతో ఆగిన లిఫ్ట్.. ప్రయాణీకుల అవస్థలు..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శ్రీకాకుళం రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన లిఫ్టు విద్యుత్ సుమారు అర్థగంటసేపు ఆగిపోవడంతో చిన్నారులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ ప్రెస్ నుంచి దిగిన ప్రయాణికులు లిఫ్టులో బయటకు వచ్చేందుకు వెళ్లారు. లిఫ్టు మార్గమధ్యంలో విద్యుత్ అంతరాయం కారణంగా నిలిచిపోయింది.

లిఫ్ట్ లో గాలి ఆడక చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. అయితే అరగంట తరువాత విద్యుత్ వచ్చేయడంతో లిఫ్ట్ పని చేసి బయటకు వచ్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోవట్లేదని రైల్వే ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement