Sunday, May 12, 2024

Breaking: పుట్టగొడుగులు తిని 18మందికి అస్వస్థత

పుట్టగొడుగులు తిని 18మంది అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేటలో పుట్టగొడుగులు తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొబ్బరి తోటలో మొలసిన పుట్టగొడుగులు తిని 18 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement