Saturday, April 27, 2024

10న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 11న శ్రీరామ పట్టాభిషేకం..

తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 10వ తేదిన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీరాముల వారు హనుమంత వాహనం పై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏర్పిల్‌ 11 న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భనంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీసీతారమలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు చందనంతో అభిషేకం చేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది.

ఆదివారం రాత్రి 10 నుంచి 11 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది. ఏప్రిల్‌ 11 న సోమవారం సాయంత్రం 5 గంటలకు శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామపట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement