Wednesday, April 17, 2024

రేప‌టి నుంచి ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం..

తిరుమల, ప్రభన్యూస్ : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఈ నెల ప్రత్యేక దర్శన కోటాను శుక్రవారం ఉదయం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. సాఫ్ట్‌ వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఏప్రిల్‌ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్‌ 8కి దర్శన టికెట్లను వాయిదా వేశారు. రోజుకు 1000 టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. 9వ తేదీ నుంచి నిర్దేశించిన స్లాట్‌లలో వీరిని దర్శనానికి అనుమతిస్తారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ పునరుద్ధరించింది.

కాగా వీరిని ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్‌లో దివ్యాంగుల క్యూ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం నాడు మాత్రం మధ్యాహ్నం మూడు గంటల స్లాట్‌ కేటాయించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో దర్శన టోకెన్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement