Thursday, May 2, 2024

వైసీపీ ప్ర‌భుత్వంపై సోము వీర్రాజు ఫైర్

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. గుంటూరులో జరిగిన రైతు గర్జన సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ…. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందన్నారు. మిర్చి రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం కింద నిధులు మంజూరు చేస్తే ఆ బీమాను కూడా అమలు పర్చడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇంతవరకూ డబ్బులు చెల్లించలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఘోరంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement