Sunday, May 5, 2024

రేషన్ బియ్యం దందాకు అడ్డాగా సచివాలయం..

వెలిగండ్ల,(ప్రభాన్యూస్): రామ గోపాలపురం సచివాలయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని వెలిగండ్ల పోలీసులు బుధవారం రాత్రి సమయంలో స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే బియ్యం పంపిణీ చేసే వాహనం డ్రైవర్ నూతనంగా నిర్మించిన సచివాలయంలో అక్రమంగా బియ్యం దాచిపెట్టి అక్రమ వ్యాపారాలకు విక్రయిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు జిల్లా ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేశారు దీంతో స్థానిక ఎస్సై రాజ్ కుమార్ కి సమాచారం వచ్చింది వెంటనే సచివాలయాన్ని తనిఖీ చేయగా 29 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనమైనది డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement