Thursday, May 2, 2024

Krishna: పంటకాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

పంటకాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వానపాముల దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణీస్తున్న పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 68మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement