Saturday, April 27, 2024

AP: బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

అమరావతి : విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు.

ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement