Sunday, April 28, 2024

Twitter war : మీ వ‌న్ని విలువ‌లు లేని రాజ‌కీయాలు… పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి

మీ వ‌న్ని విలువ‌లు లేని రాజ‌కీయాలని పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి విమ‌ర్శ‌లు కురిపించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురందేశ్వరి మారారని మండిపడ్డారు.

నమ్మకద్రోహం పురందేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురందేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement