Tuesday, May 14, 2024

లారీని ఢీ కొట్టిన స్కార్పియో..ఇద్దరు మృతి..

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం పురుషోత్తపురం హై వే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓ స్కార్పియో వాహనం ఢీ కొట్టింది. ఘటనలో స్కార్పియోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్.కోట నుంచి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement