Wednesday, May 8, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం, మృతులంతా హైదరాబాద్‌ వాసులే

అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడ-హైదరాబాద్‌ -65వ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఆరు నెలల చిన్నారితో సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద ఈఘటన చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం గౌరవరం కాలువ వద్ద కారు అదుపుతప్పి సాగర్‌ కెనాల్‌ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థి తి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ జిహెచ్‌ఎంసిలో పనిచేస్తున్న కూరపాటి ఆనందరావు మనుమరాలు ప్రిన్సీ అన్న్రపాసన నిమిత్తం కుటు-ంబ సభ్యులతో కలిసి జంగారెడ్డిగూడెం అడవి మల్లు గ్రామానికి శనివారం రాత్రి బయలుదేరి వెళ్ళారు.

కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా కృష్ణాజి ల్లా జగ్గయ్యపేట వద్ద చిల్లకల్లు టోల్‌గేటు దాటిన తర్వాత అదుపు తప్పిన కారు సాగర్‌ కెనాల్‌ వాల్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో అక్కడికక్కడే ఆనందరావు తోపాటు- కూతురు ఆదూరి శాంత, కోడలు కూరపాటి ఇందిర, మనుమరాలు ప్రిన్సీ మృతి చెందగా, భార్య కూరపాటి మార్తమ్మ, కుమారుడు కూరపాటి జోషిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరగ్గానే స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్ప్రతికి తరలించారు. అయితే కొద్దిసేపటి తర్వాత విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కూరపాటి మార్తమ్మ మృతి చెందింది. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న జగ్గయ్యపేట సిఐ చంద్రశేఖర్‌ ఘటనాస్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement