Thursday, May 23, 2024

నిండు జీవితానికి రెండు చుక్కలు.. ఏపీలో పల్స్ పోలియో కార్యక్రమం

దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పోలియో చుక్కల పంపిణీకి పూర్తి ఏర్పాట్లు చేశారు. పీహెచ్‌సీలు, సామాజిక కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతోపాటు ఇతర ముఖ్య కూడళ్లలో పోలియో చుక్కలను పంపణీ చేస్తున్నారు.అలాగే, ప్రత్యేక ప్రదేశాల్లో నివసించే సంచార జాతుల కుటుంబాల చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 1,374 వాహనాలను ఏర్పాటు చేశారు.పోలియో చుక్కలను నేడు పంపిణీ చేయడంతోపాటు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement