Friday, April 26, 2024

పేదల సంక్షేమానికి ప్రాధాన్యత- ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ ప్రభ న్యూస్.. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం 14వ డివిజన్ బైరాగి పట్టెడ వీధుల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు సాధించిన ప్రగతి వివరించారు. ఆ ప్రాంతంలోని ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా తమకు డ్రైనేజీ వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా ఉందని.. వర్షం వస్తే బ‌య‌టికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని విన్నవించారు. దోమల సమస్యలు ఎక్కువగా ఉందని.. వర్షం వస్తే రోడ్డుపైనే నీళ్లు నిలుస్తున్నాయని తెలియజేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..సీఎం జ‌గ‌న్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.. 1,65 వేల కోట్ల రూపాయలు పథకాలు ద్వారా రావడం జరిగిందని వివరించారు.. ఇన్ని వేల కోట్లు సంక్షేమ పథకాలకు అందించడం ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.. ప్రతి గడపగడపకు వెళుతూ ఉంటే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ. కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు. ఆదం రాధారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి రాజారెడ్డి. ప్రభాకర్ రెడ్డి .గోవింద్ రెడ్డి. పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement