Friday, May 3, 2024

Flash: బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్.. గర్భిణికి తీవ్ర గాయాలు

కృష్ణా జిల్లా నాగాయలంకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కాలేజ్ బస్సు కిందకు బైక్ దూసుకెళ్లింది. దీంతో బైక్ మీద ప్రయాణిస్తున్న చాట్రగడ్డ శ్రీ చరణ్ (17) జి. దుర్గ భవాని (22)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరినీ 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, దుర్గ భవాని ఎనిమిదో నెల గర్భవతి. నాగాయలంక మండలం గణపేస్వరం నుంచి తమ్ముడితో కలిసి అవనిగడ్డ ఆస్పత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇరువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు విజయవాడ రిఫర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement