Monday, May 6, 2024

సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం…

కందుకూరు : రామాయపట్నం మేజర్‌ పోర్టు సాధన కోసం ప్రకాశంజిల్లా కందుకూరు పట్టణంలో ధర్నా జరిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేజర్‌ పోర్టు సాధన కమిటీ కన్వీనర్‌ బివి (బి.వెంకటేశ్వర్లు) తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కూడా సంఘీభావం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. మేజర్‌ పోర్టు నిర్మాణం కోసం కేంద్రంపై ఆఖరి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయ స్వామి, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఇన్‌చార్జి బాలాజీ, కందుకూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాంతోపాటు స్థానిక వామపక్ష పార్టీ నాయకులు, ప్రజాపక్ష సంఘ నాయకులు పాలేటి కోటేశ్వరరావు, కసుకుర్తి మాల్యాద్రి, తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు నాయకులందరూ కలిసి మేజర్‌ పోర్టు సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని కోరుతూ సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజకు వినతి పత్రం సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement