Sunday, May 19, 2024

వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వలసలు..


కందుకూరు ‌ : ప్రకాశంజిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ లోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. ఉలవపాడు మండలం క్రిష్ణాపురం గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీకి గుడబై చెప్పి వైసిపి కండువాలు వేయించుకున్నారు. కందుకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే మహీధం రెడ్డి చేతుల మీదుగా వైసిపి కండువాలు వేయించుకుని పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరచడం ద్వారా నెగ్గిన సర్పంచ, ఉపసర్పంచలు కూడా వైసిపి కండువాలు కప్పుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement