Thursday, May 2, 2024

ఉయ్యాలవాడ పేరుపెట్టడం అభినందనీయం..

యర్రగొండపాలెం : ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు యర్రగొండపాలెం వైసిపి పట్టణ అధ్యక్షులు జబీవుల్లా తెలిపారు. ఈ విమానాశ్రయానికి ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయి అలుపెరుగని పోరాటం చేసిన ఉయ్యాడవాడ నరసింహారెడ్డి లాంటి గొప్పవ్యక్తి పేరుపెట్టడం హర్షణీయమని సీఎం జగన్ నిర్ణయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు.. అనంతపురం జిల్లాలతో పాటు రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న ప్రకాశం, తెలంగాణాలోని గద్వాల, కర్ణాటకలోని రాయచూరు జిల్లాల ప్రజలకు ఉపయోగపడేలా ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా సియం జగన్‌ ఇప్పటికే న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించారని దీనికి తోడు విమాన సర్వీసులు కూడా తోడు కావడంతో ప్రయాణ సౌలభ్యంతో పాటు ఆ ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ పోటీ ప్రపంచంలో రవాణారంగం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు ఎన్నో సం.ల నుండి ఎదురుచూస్తున్న కల నెరవేరిందన్నారు. ప్రారంభం రోజు నుండే విశాఖ , చెన్నై, బెంగళూరు, గన్నవరం వంటి ప్రాంతాలకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేసిన సియం వైయస్‌ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ రోజు రోజుకు శరవేగంగా అభివృద్ది చెందుతున్న కర్నూలు నగర జిల్లా ప్రజలు విమాన సేవలు అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement