Friday, April 26, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులు మార్కాపురం పట్టణం కొండారెడ్డి కాలనీకి చెందిన పర్రె సుబ్బారాయుడు, విభూది మౌలాలిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పొదిలి సిఐ సుధాకర్, టివిపల్లి ఎస్ఐ ముక్కంటి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement