Thursday, May 16, 2024

పంచాయితీ కార్యదర్శుల నిరసన..

కొనకనమిట్ల : డిడిఓలుగా విఆర్‌ఓలను నియమించడాన్ని పంచాయితీ కార్యదర్శులను డిడిఓగా తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 2 సం.ల నుండి సచివాలయంలో డిడిఓగా పనిచేస్తున్న తమను అకస్మాత్తుగా తొలగించి విద్యార్హత తక్కువగా ఉన్న విఆర్‌ఓలను నియమించడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయ అభివృద్ది కోసం ఎంతో కృషి చేసిన తమను అకస్మాత్తుగా డిడిఓ అధికారం నుండి తొలగించడం సబబు కాదన్నారు. అనంతరం మండల పరిషత్‌ జూ. అసిస్టెంట్‌ రఫాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయితీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు తిరుపతి, సభ్యులు బ్రహ్మనాయుడు, నరసింహారావు, పలువురు కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement