Saturday, April 27, 2024

ఆపరేషన్‌ ముస్కాన్..

కందుకూరు : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి మరియు కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.శ్రీనివాసులు వారి ఆదేశాల మేరకు బాలకార్మికుల రక్షణకు జిల్లా వ్యాప్తంగా ఉన్న డివిజన్‌ స్థాయిలో అన్ని శాఖలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో భాగంగా కందుకూరు డివిజన్‌ పరిధిలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ ఎలిజిబెత్‌ మరియు కందుకూరు టౌన్‌ ఎస్సై తిరుపతిరావు సారధ్యంలో వివిధ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై ప్రసాద్‌, న్యాయ సేవా సహాయకులు, చేవూరి దుర్గాప్రసాద్‌, పంతగాని వెంకటేశ్వర్లు, రమేష్‌, షేక్‌ సల్మా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement