Tuesday, March 26, 2024

రామాలయంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్

కందుకూరు: కందుకూరు పట్టణంలోని పెద్ద బజారులో శ్రీ సీతారామ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మాచవరం పిహెచ్‌సి వారు వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కందుకూరు వారి విభాగం వారి సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సుమారు 220 మందికి విజయవంతంగా వ్యాక్సిన్‌ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచవరం డాక్టర్‌ కె.పి.స్వాతి, సిబ్బంది, బూడిదపాలెం సచివాలయం హెల్త్‌ సెక్రటరీ వి.రజిత, సిబ్బంది, ప్రపంచ ఆర్యవైశ్య అధ్యక్షులు వేణుగోపాలరావు, వాసవి క్లబ్‌ అధ్యక్షులు గుర్రం అల్లూరయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement