Thursday, April 25, 2024

ముగిసిన 6వ రాష్ట్రస్థాయి బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీలు

కందుకూరు టౌన్ , కందుకూరు పట్టణంలోని టిఆర్‌ఆర్‌ కళాశాలలలో 6వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల హ్యాండ్‌ బాల్‌ పోటీలు 2 రోజులుగా జరుగుతున్న పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో 9 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. వెస్ట్‌ గోదావరి జిల్లా టీమ్‌ విజేతగా నిలిచింది., ప్రకాశంజిల్లా టీమ్‌ రన్నర్స్‌గా నిలిచారు. కృష్ణాజిల్లా చివరి మూడో టీమ్‌గా నిలిచింది. విజేతలకు కందుకూరు సిఐ విజయ్‌కుమార్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డి గ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ రవికుమార్‌, జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాగేశ్వరరావు, ఎస్సై కృష్ణపావని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement