Friday, May 3, 2024

పొట్టి శ్రీరాములు 120వ జయంతి వేడుకలు

ఉలవపాడు : మండల కేంద్రమైన ఉలవపాడులో అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దేవాలయం సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రాహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి క్లబ్‌ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్షచేశారని ఆయన తెలిపారు. ఆయన మార్చి 16 1901లో జన్మించారని ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని, ఆయన సూక్తితో ఆర్యవైశ్యులంతా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్‌ సెక్రటరీ బి.సుబ్రమణ్యం, ట్రెజరర్‌ సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బి.హరినాధ్‌బాబు, మహిళా మండలి అధ్యక్షురాలు బి.సీతారావమ్మ, ఆర్యవైశ్య వాసవి క్లబ్‌ వనిత అధ్యక్షురాలు కె.సుజాత, పి శ్రీలక్ష్మి, ఎ జయశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement