Friday, May 17, 2024

ఎస్ఐగా ‘విశ్వనాధ రెడ్డి’

ఉలవపాడు : మండల కేంద్రమైన ఉలవపాడు నూతన ఎస్ ఐగా బి.విశ్వనాధ‌ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఒంగోలు స్పెషల్‌ బ్రాంచి నుండి బదిలీపై ఉలవపాడుకు వచ్చారు. ఉలవపాడు ఎస్సై దేవకుమార్‌ చీరాల ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీపై వెళ్ళారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై విశ్వనాధ రెడ్డి మాట్లాడుతూ ఆటోవారు ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాలని, అలాగే కృష్ణానగర్‌లో ట్రాఫిక్‌ను కంట్రోల్‌చేసి అంబేద్కర్‌ బొమ్మ వద్ద ఒక కానిస్టేబుల్‌ను నియమించనున్నట్లు తెలిపారు. పేకాట, కోడి పందేలపై సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement