Monday, April 29, 2024

దేవాలయాల్లో చోరీ

ఉలవపాడు : రెండు దేవాలయాల్లో చోరి జరిగింది. ఉలవపాడు మండలం కరేడు గ్రామంలోని కనకదుర్గ ఆలయం .. రామాలయంలో దేవాలయంలో హుండీలను దొంగిలించి తీసుకెళ్ళారు. విషయం తెలుసుకున్న సిఐ విజయ్‌కుమార్‌, ఎస్సై విశ్వనాధ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ హుండీలలో సుమారు రూ.5,500లు ఉందని ఎస్సై తెలిపారు. మండలంలోని అన్నీ దేవాలయాల కమిటీల వారు సిసి కెమేరాలను దేవాలయాల్లో ఏర్పాటు చేయాలని ప్రజలను కోరారు. దొంగతనం జరిగిన దేవాలయాల్లో క్లూస్‌ టీమ్‌ వచ్చి పరిశీలించారు. ఎస్సై విశ్వనాధ రెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement