Monday, May 6, 2024

Prakasam – లారీ – బైక్ ఢీ – ముగ్గురు దుర్మరణం

ప్రకాశం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను అంబాపురానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement