Monday, May 6, 2024

మానవత్వం చాటుకున్న సంస్థాన్ పోలీసులు

సంస్థాన్ నారాయణపురం ఆగస్టు 19 (ప్రభ న్యూస్): రోడ్డుపై నిస్సహాయ స్థితిలో బక్క చిక్కి ఆకలితో అలమటిస్తున్న అనాధ మహిళకు ఆశ్రయం కల్పించారు సంస్థాన్ నారాయణపురం పోలీసులు.. వివరాలలోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో పెట్రోలింగ్ బండిలో గస్తి కాస్తున్న కానిస్టేబుల్ శాంతం కుమార్ సతీష్ లకు అనాధ మహిళ ఎదురైంది వివరాలు అడగగా ఏలాంటి సమాచారం తెలుపలేదు.. దీంతో ఎస్సై రాఘవేందర్ గౌడ్ కు సమాచారం ఇచ్చారు..

మతిస్థిమితం లేకపోవడంతో ఎస్ఎ ఐ కి లాంటి సమాచారం తెలుపకపోవడం వల్ల ఆకలితో ఉన్న ఆమెకు అన్నం తినిపించి చౌటుప్పల్ లో ఉన్న అమ్మానాన్న అనాధాశ్రమానికి అప్పగించారు. అనాధ మహిళలకు ఆశ్రయం కల్పించడం పట్ల స్థానికులు ఎస్సై రాఘవేందర్ కు కానిస్టేబుల్ కు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement