Friday, May 17, 2024

మొన్న ప్రకాశం బ్యారేజి.. నిన్న పులిచింతల.. రేపు పోలవరం గేట్లా?

ఏపీలో జగన్ సర్కార్ పై ప్రజలకు నమ్మకం ఎప్పుడో పోయిందని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. పాపికొండలు విహార యాత్రకు వెళ్లి మునిగిపోయిన ప్రకాశం బ్యారేజ్ గేట్ల మధ్య ఇరుక్కున్న పడవలనే తీయడం చేతకాని ఇరిగేషన్ శాఖ మంత్రి.. బ్యారేజ్ లను కాపాడగలరా? అని ప్రశ్నించారు. మొన్న ప్రకాశం బ్యారేజి, నిన్న పులిచింతల ప్రాజెక్టు రేపు పోలవరం గేట్లా? అని పేర్కొన్నారు. ఇటువంటి వారు మన మంత్రులు ఈరాష్ట్రానికి దౌర్భాగ్యం అని అన్నారు. వీరు ప్రాజెక్టులను నిర్మించగలరా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్వహణ, నాణ్యతలకు మాత్రం అర్థం తెలియదన్నారు. కానీ ప్రాజెక్టుల ముసుగులో అవినీతి సంపాదనకు మాత్రం దారులు బాగా తెలుసునన్నారు. 16 గేట్ కొట్టుకుపోవడంతో రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైందని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మైనార్టీలకు ర‌క్షణ ఏదీ? : లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement